డార్జిలింగ్ యువతిపై హైదరాబాద్ లో సామూహిక అత్యాచారం..?
తాను ప్రేమించానని ఏడాదిపాటు కలిసి తిరిగాడు.. పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడు. అయితే చివరకు తన స్నేహితులతో కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ యువతి ఫిర్యాదు చేసిన సంఘటన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోరి హిమాయత్ నగర్ ప్రాంతంలో డార్జిలింగ్ కు చెందిన యువతి బ్యూటీపార్లర్ లో పని చేస్తోంది. ఆమెకు మాజిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. అతను ఆమెతో ఏడాదిగా ప్రేమాయణం నెరిపాడు. అనంతరం తన స్నేహితులతో కలసి మాజిత్ తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులను ఆశ్రయించాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు మాజిత్ తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. మరో ఐదు మంది పరారీలో ఉన్నారు. బాధిత యువతిని వైద్యపరీక్షలు పంపారు.