గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Selvi
Last Updated : మంగళవారం, 1 ఆగస్టు 2017 (14:25 IST)

కోడిగుడ్డులోని తెల్లసొనతో చర్మ సౌందర్యం.. మరిన్ని చిట్కాలు..

రసాయనాలతో కూడిన క్రీములు వంటివి వాడటం కంటే.. మెరిసే సౌందర్యం కోసం సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో చూద్దాం.. ముఖంపై వుండే మొటిమలను దూరం చేసుకోవాలంటే మహిళలు పోషకాహారం తీసుకోవాలి. జీర్ణక్రి

రసాయనాలతో కూడిన క్రీములు వంటివి వాడటం కంటే.. మెరిసే సౌందర్యం కోసం సహజ సిద్ధమైన చిట్కాలు పాటించడం ఉత్తమం. అవేంటో చూద్దాం.. ముఖంపై వుండే మొటిమలను దూరం చేసుకోవాలంటే మహిళలు పోషకాహారం తీసుకోవాలి. జీర్ణక్రియ సక్రమంగా వుందా అనేది తెలుసుకోవాలి. ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేసుకోవాలి.
 
ముఖంపై మచ్చలు తొలగిపోవాలంటే.. కోడిగుడ్డులోని తెల్లసొనను కప్పులోకి తీసుకుని అందులో సున్నిపిండి కలిపి ముఖానికి పట్టించాలి. 15 నిమిషాల తర్వాత పాలతో ముఖాన్ని కడిగేయాలి. ఆపై నీటితో శుభ్రం చేసుకుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం కోమలంగా తయారవుతుంది. 
 
ఆరెంజ్ తొక్కల పౌడర్‌లో ముల్తానీ మట్టి, చందనం, పెరుగును కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత కడిగేయాలి. అలాగే లేత వేపాకులు, ఆరెంజ్ తొక్కల పౌడర్, పసుపును సమపాళ్లలో తీసుకుని.. మొటిమలు ఉన్న ప్రాంతంలో రాసుకుని పది నిమిషాల తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. కంటి వలయాలను దూరం చేసుకోవాలంటే బాదం ఆయిల్ రాయడం మంచిది. 
 
అలాగే బార్లీ పౌడర్‌తో పసుపు పొడి, నువ్వుల నూనెను చేర్చి ముఖానికి రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారుతుంది. మెడ చుట్టూ వుండే నల్లటి వలయాలను దూరం చేసుకోవాలంటే.. కోడిగుడ్డు తెల్లసొనను తీసుకుని.. గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి పూతలా వేసుకుని అరగంట తర్వాత కడిగేయాలి.