శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (14:30 IST)

బొజ్జను తగ్గించాలంటే.. ఈ జ్యూస్‌ను తాగండి..

ముందుగా కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూ

కంప్యూటర్ల ముందు గంటల పాటు కూర్చోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జంక్ ఫుడ్ తీసుకోవడం, పోషకాహారానికి దూరమవడం వంటి కారణాల చేత.. మూడు పదుల్లోనే ఆడామగా తేడా లేకుండా బొజ్జ పెరిగిపోతుంది. అలా మీకు కూడా బొజ్జ పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ జ్యూస్‌ను తాగండి అంటున్నారు. ఆరోగ్య నిపుణులు. 
 
కడుపులో పేరుకుపోయిన కొవ్వును కరిగించడం అంత సులభం కాదు. పొత్తి కడుపులో కొవ్వు పేరుకుపోతే.. దాన్ని కరిగించేందుకు ఆహారంలో మార్పులు చేసుకోవాలి. వ్యాయామం చేయాలి. ఇంకా ఈ జ్యూస్‌ను పరగడుపున తాగడం ద్వారా పొట్టను  తగ్గించుకోవచ్చు. 
 
పొట్టను తగ్గించే జ్యూస్ ఎలా చేయాలంటే?
కావలసిన పదార్థాలు : 
కీరదోస -1 
నిమ్మ కాయ - 1  
పుదీనా ఆకులు - అర కప్పు 
అల్లం తురుము - రెండు స్పూన్లు 
నీరు  -  తగినంత 
 
తయారీ విధానం: 
ముందుగా కీరదోసను శుభ్రం చేసుకుని.. తొక్కను తీసేసి మిక్సీలో రుబ్బుకోవాలి. అందులో నిమ్మరసాన్ని పిండుకోవాలి. పుదీనా తురుము, అల్లం తరుగు చేర్చుకుని తగినన్ని నీటితో జ్యూస్‌లా తయారు చేసుకోవాలి. రోజూ ఉదయం పూట ఈరసాన్ని తాగితే మూడు నెలల్లోపు పొట్ట తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
అదే విధంగా ఓ గ్లాసుడు వేడి నీటిలో ఒక నిమ్మకాయ రసం, తేనె, రెండు వెల్లుల్లి రేకుల పొడిని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ ఉదయం పూట తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.