శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 10 మార్చి 2018 (16:11 IST)

నా భార్య కంటే ధోనీ ఇష్టం.. కానీ భారత్ శత్రుదేశమని?: చికాగో చాచా

పాకిస్థాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) అంటే తెలియని వారుండరు. చికాగో చాచా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ప్రస్తుతం నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకకు వచ్చిన చాచా..

పాకిస్థాన్ అభిమాని మహ్మద్ బషీర్ అకా (చికాగో చాచా) అంటే తెలియని వారుండరు. చికాగో చాచా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. ప్రస్తుతం నిదహాస్ ట్రోఫీలో భాగంగా శ్రీలంకకు వచ్చిన చాచా.. ధోనీపై తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన భార్య కంటే ధోనీ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమని చాచా తెలిపాడు. చాచాతో పాటు భారత వీరాభిమాని సుధీర్, బంగ్లాదేశ్ ఫ్యాన్ షోయబ్ అలీలతో కలిసి మీడియాతో ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా చాచా మాట్లాడుతూ.. 2011 ప్రపంచకప్‌ సెమీఫైనల్‌ వరకు ధోని ఎవరో తనకు తెలియదన్నాడు. 2011 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కోసం తాను మొహాలీ చేరుకున్నానని.. మ్యాచ్ టిక్కెట్లు లేకపోవడంతో తనకు మ్యాచ్ చూడాలని వుందని ప్లకార్డ్ ప్రదర్శించానని తెలిపాడు. అప్పుడు ఓ వ్యక్తి టికెట్స్‌ ఉన్న కవర్‌ తీసుకొచ్చి ఇస్తూ.. ఈ టికెట్లు ధోని పంపించాడని తెలిపాడు. 
 
అలా ధోనీ పంపిన టికెట్స్‌తో మ్యాచ్‌ను ఆస్వాదించానని చాచా చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి ధోనీని తన భార్య కంటే ఎక్కువ ఇష్టపడుతున్నట్లు చెప్పాడు. ఆ క్షణం నుంచి భారత్ మ్యాచ్‌లు చూస్తూనే వున్నానని తెలిపాడు. 
 
కానీ చాలామంది భారత్‌కు ఎందుకు మద్దతిస్తున్నావని అడిగారు. అలా అడిగిన వారితో.. భారత్ నుంచే ఎక్కువ ప్రేమను పొందగలరని చెప్పానని చాచా చెప్పాడు. కానీ పాకిస్థాన్‌లో వృద్ధులంతా భారత్ శత్రుదేశమని యువకులకు నూరిపోయడం మంచిది కాదని చాచా చెప్పాడు.