శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 12 అక్టోబరు 2017 (13:35 IST)

మొలకెత్తిన పెసళ్లను షాపుల్లో కొనుక్కొచ్చి అలానే తినేస్తే?

మొలకెత్తిన పెసలను తీసుకోవడం ద్వారా దృష్టి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు నయం అవుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. వృద్ధాప్య ఛాయ‌ల‌ను మొలకెత్తిన పెసళ్లు ద‌రిచేర‌నివ్వ‌వు. గ్యాస్‌, అసిడిటీ వంటి

మొలకెత్తిన పెసలను తీసుకోవడం ద్వారా దృష్టి సంబంధిత సమస్యలు దూరమవుతాయి. గుండె జబ్బులు నయం అవుతాయని న్యూట్రీషన్లు అంటున్నారు. వృద్ధాప్య ఛాయ‌ల‌ను మొలకెత్తిన పెసళ్లు ద‌రిచేర‌నివ్వ‌వు.

గ్యాస్‌, అసిడిటీ వంటి జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు దూర‌ం చేస్తాయి. శరీరంలో ఏర్పడే ఇన్ఫెక్షన్లను తొలగింటే యాంటీ-ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా వున్నాయి. ఇవి రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. 
 
రక్తంలోని చక్కెర స్థాయిలను ఇది అదుపు చేస్తుంది. తద్వారా మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేకూరుతుంది. శ‌రీరంలోని నొప్పులు, వాపుల‌ను త‌గ్గించే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఈ మొల‌కెత్తిన పెస‌ల‌లో ఉన్నాయి. ఇందులో వుండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. తద్వారా ఒబిసిటీ దూరమవుతుంది. విట‌మిన్ ఎ, బి, సి, డి, ఇ, కె, వంటివి పోషకాలు వుండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
అయితే షాపుల్లో నుంచి తీసుకొచ్చే మొలకెత్తిన పెసళ్లను నీటిలో శుభ్రం చేసి ఆపై కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాక ఉడికించి పిల్లలకు పెట్టొచ్చు. పెద్దలు మాత్రం నీటిలో శుభ్రపరిచిన పెసళ్లను పచ్చిగానే తీసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. నీటిలో శుభ్రం చేయకుండా పచ్చిగా అలానే వాటిని తింటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం ఉంది.

ఇ-కోలి బ్యాక్టీరియా ఇందులో వుంటాయి. అందుచేత వీటిని పచ్చిగా తింటే తలనొప్పి, వేవిళ్లు వంటి రుగ్మతలు ఏర్పడే అవకాశం ఉంది. ఇ-కోలీ ద్వారా కిడ్నీకి అంత మంచిది కాదని.. అందుకే ప్యాకేజ్ అయిన ఆహార పదార్థాలను కడిగిన తర్వాతే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.