శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 9 మార్చి 2018 (21:57 IST)

వాయు కాలుష్యంతో హృద్రోగాలు...

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస

చెట్లు కొట్టేయడం, మనుషులు కన్నా వాహనాలు ఎక్కువ కావడం, ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న రసాయనాలు.... వంటి వాటి కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఇంతకాలం అనుకున్నట్లు వాయు కాలుష్యం వల్ల కేవలం ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలే కాకుండా, హృద్రోగ సమస్యలూ వస్తున్నాయని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు.
 
ముఖ్యంగా రక్తంలో చక్కెర శాతంతో పాటు కొలస్ట్రాల్ పెరగడానికి తద్వారా హృద్రోగ మరణాలకు దారితీస్తుందని అమెరికన్ పరిశోధకులు పేర్కొంటున్నారు. షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుందట. ఇందుకోసం దక్షిణ ఇజ్రాయెల్‌లో వాయుకాలుష్యానికి గురవుతున్న కొందరు వ్యక్తుల మీద ఈ ప్రభావాన్ని లెక్కించారట. 
 
గాలిలో ఏరోసల్స్ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో నివసించే వాళ్ల రక్త నమూనాలను పదేళ్లపాటు నిరంతరాయంగా సేకరించి పరిశీలించారట. వాటిల్లో రక్తంలో చెడు కొలస్ట్రాల్ బాగా పెరగడంతో పాటు మంచి కొలస్ట్రాల్ తగ్గిందట. అంతేకాదు, సాధారణ వ్యక్తులతో పోలిస్తే చక్కెర రోగుల్లో చెడు కొలస్ట్రాల్ చాలా ఎక్కువగా పెరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి వాయుకాలుష్యం వల్ల హృద్రోగాలు పెరుగుతున్నాయని వాళ్లు విశ్లేషిస్తున్నారు. కాబట్టి మనచుట్టూ ఉన్న గాలిమీద ఓ కన్ను వేయాల్సిందే.