గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 13 నవంబరు 2017 (10:35 IST)

అద్దె గర్భం విధానం ఈనాటిది కాదంటున్న టర్కీ ప్రొఫెసర్

అద్దె గర్భం లేదా సరోగసి. ఈ విధానం ద్వారా పిల్లలు లేని తల్లులు మరో స్త్రీ ద్వారా (అద్దెగర్భం) ద్వారా పిల్లల్ని కనడం. అయితే, ఈ విధానం జరిగే కాన్పుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి.

అద్దె గర్భం లేదా సరోగసి. ఈ విధానం ద్వారా పిల్లలు లేని తల్లులు మరో స్త్రీ ద్వారా (అద్దెగర్భం) ద్వారా పిల్లల్ని కనడం. అయితే, ఈ విధానం జరిగే కాన్పుల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైపోయాయి. ముఖ్యంగా.. కోటీశ్వరులు, సెలబ్రెటి మహిళల్లో పెక్కుమంది ఈ విధానం ద్వారా తల్లులు అయ్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. 
 
అయితే ఈ విధానం ఈ కాలం నాటిదని టర్కీకి చెందిన పురావస్తు శాఖ ప్రొఫెసర్ ఒకరు అంటున్నారు. సరోగేట్‌ విధానం 4 వేల ఏళ్ల క్రితమే ఉందని ఆయన చెపుతున్నారు. టర్కీలో దొరికిన ఆ కాలపు నాటి ఓ వివాహ ఒప్పంద పత్రంలో ఈ విషయాన్ని గుర్తించారు. వివాహమైన జంటకు రెండేళ్ల వరకూ సంతానం కలగకపోతే.. సదరు భర్త పిల్లల కోసం ఓ బానిస స్త్రీని వినియోగించవచ్చు. వారికి తొలి మగ బిడ్డ పుట్టాక ఆ కుటుంబం బానిస స్త్రీకి విముక్తి కల్పించాలి. 
 
ఓ మట్టి పాత్ర మీద చెక్కిన వివాహ ఒప్పంద పత్రంలో ఈ వివరాలను గుర్తించినట్లు టర్కీలోని హర్రన్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్ బెర్కిజ్‌ టర్ప్‌ వెల్లడించారు. ఈ ప్రాంతం మెసపొటేమియన్‌ నాగరికతలో భాగమైన అస్సిమిరియన్‌ సామ్రాజ్యంలో ఉండేదని, ఏ ఒక్కరూ సంతానం లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో నాడు ఈ నిబంధన విధించి ఉండవచ్చని టర్ప్‌ వ్యాఖ్యానించారు. ఈ ఆధారాన్ని ఇస్తాంబుల్‌ పురావస్తు ప్రదర్శనశాలలో భద్రపరిచారు.