గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
Written By pnr
Last Updated : సోమవారం, 19 జూన్ 2017 (16:50 IST)

పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో జరిగినవి ఏమిటి?

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానానుసారమే సమాజంలో అనేక వింతలు విశేషాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన విషయాలను ఓసారి పరికిస్తే పోతులూరి కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగానే జరగడం గమనార్హ

శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానానుసారమే సమాజంలో అనేక వింతలు విశేషాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు జరిగిన విషయాలను ఓసారి పరికిస్తే పోతులూరి కాలజ్ఞానంలో పేర్కొన్నట్టుగానే జరగడం గమనార్హం. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం. 
 
భారతదేశాన్ని ఓ అంబ 16 యేళ్ల పాటు రాజ్యమేలుతుంది. (ఇందిరా గాంధీ దశాబ్దన్నర కాలానికిపైగా దేశ ప్రధానిగా ఉన్నారు). 
తెరమీద కదిలే బొమ్మలు గద్దెనెక్కుతాయి. ప్రజలను పాలిస్తారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారు. (పలువురు సినీ నటులు పలు రాష్ట్రాలను పాలించారు). 
దేశంలో రాచరికాలు, రాజుల పాలన నశిస్తాయి. (ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ కూడా రాజుల పాలన లేదు). 
ఆకాశాన పక్షి వాహనాదులు కూలి అనేకమంది మరణిస్తారు. (ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న విమాన ప్రమాదాల్లో ఎంతో కొంతమంది చనిపోతూనే ఉన్నారు). 
సమాజంలో జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. (ప్రపంచ జనాభా విపరీతంగా పెరిగింది).
బ్రాహ్మణ అగ్రహారాలు అంతరించిపోతాయి. (ఇపుడు దేశంలో బ్రాహ్మణ అగ్రహాలు ఎక్కడా కనిపించవు). 
హైదరాబాద్‌ నగరంలో తురకలు, హిందువులు ఒకర్నొకరు నరుక్కుని చచ్చిపోతారు. (హైదరాబాద్ నగరం మతకలహాలకు పెట్టింది పేరు). 
ఆలయాలు పాపాత్ముల వల్ల నాశనమవుతాయి. దేవతా విగ్రహాలు దొంగిలించబడతాయి. (దేశంలో అనేక ఆలయాల్లో విగ్రహాలు చోరీకి గురవుతున్నాయి). 
చిత్ర విచిత్రమైన యంత్రాలు వస్తాయి. కానీ, చావు పుట్టుకలు మాత్రం కనుగొనలేకపోతారు. (అన్ని రకాల యంత్రాలూ వచ్చినా.. చనిపోయిన వారిని బతికించే యంత్రం, మనుషుల్ని పుట్టించే యంత్రాన్ని ఇప్పటివరకు కనుగొనలేకపోయారు). ఇలాంటివి ఎన్నో జరిగాయి. జరుగుతూనే ఉన్నాయి.