గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 20 ఆగస్టు 2017 (12:58 IST)

21న సూర్యగ్రహణం : భూకంపాలు, సునామీకి ఛాన్సెస్... నిపుణులు వార్నింగ్ (Video)

సోమవారం అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. 1979 సంవత్సరం తర్వాత కనిపించనున్న అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే. ఈ సూర్యగ్రహణం కారణంగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని, దీని కారణంగా టోర్నడోలు ఏర్ప

సోమవారం అతిపెద్ద సూర్యగ్రహణం ఏర్పడనుంది. 1979 సంవత్సరం తర్వాత కనిపించనున్న అతిపెద్ద సూర్యగ్రహణం ఇదే. ఈ సూర్యగ్రహణం కారణంగా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు తగ్గుతాయని, దీని కారణంగా టోర్నడోలు ఏర్పడటం, భూకంపాలు, సునామీలు సంభవించడం వంటి విపత్తులకు ఆస్కారముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు.
 
ఈ సూర్యగ్రహణం సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ సుమారు ఆరు గంటల పాటు సాగే గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. అయితే, ఈ గ్రహణం ఏర్పడే సమయంలో భారత్‌లో మాత్రం రాత్రి సమయం. అందువల్ల ఇండియాలో కనిపించే అవకాశం లేదు. ఫలితంగా ఈ సూర్యగ్రహణ ప్రభావం భారత్‌పై ఏమాత్రం ఉండదు.
 
ఈ సంపూర్ణ సూర్యగ్రహణం భువిపై ఉన్న వివిధ రకాల ప్రాణాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందన్న విషయమై నాసా పరిశోధనలు చేయనుంది. ఇదిలావుండగా, అమెరికాపై సూర్యగ్రహణ ప్రభావం ఇప్పటికే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. పలు ప్రాంతాలను టోర్నడోలు వణికిస్తున్నాయి.