శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 19 జనవరి 2018 (17:57 IST)

కోచ్‌గా ఫ్లెమింగ్.. చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడనన్న ధోనీ

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ సీజన్‌ ఫీవర్ ప్రారంభమైంది. జనవరి 27, 28 తేదీల్లో ఈ ఏడాది ఐపీఎల్ ఆట‌గాళ్ల వేలం బెంగళూరులో జరగనుంది. ఈ నేపథ్యంలో స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు ఎదుర్కొని రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ ఏడాది ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. సీఎస్‌కే జట్టుకు గాను ఆ జట్టు యాజమాన్యం కోచ్‌ను ప్రకటించింది.
 
ఇందులో భాగంగా జట్టు ప్రధాన కోచ్‌ బాధ్యతలను న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ స్టీపెన్‌ ఫ్లెమింగ్‌, బ్యాటింగ్‌ కోచ్‌గా ఆసీస్‌ మాజీ ఆటగాడు మైకెల్ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌గా భారత ఆటగాడు లక్ష్మిపతి బాలాజీ వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు సీఎస్‌కే నూతన చీఫ్‌ కాశీ ప్రకటించారు. గ‌తంలో కూడా ఫ్లెమింగ్ చెన్నై జ‌ట్టుకి కోచ్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. రెండేళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఐపీఎల్‌లోకి వచ్చిన చెన్నై టీమ్ యాజమాన్యం.. రిటెన్షన్ పాలసీలో ధోనీని తీసుకుంది. దీనిపై ధోనీ స్పందిస్తూ.. ఐపీఎల్‌లో చెన్నైకి తప్ప మరో జట్టుకు ఆడే ప్రసక్తే లేదన్నాడు. చెన్నై కాకుండా మరో టీమ్ గురించి ఆలోచించలేదని ధోనీ తెలిపాడు. చెన్నైకి తనకు రెండో ఇల్లు లాంటిదని చెప్పాడు.