శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 5 ఏప్రియల్ 2018 (13:18 IST)

క్రికెట్ ప్రేమికుల కోసం జియో న్యూ ఆఫర్

ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశ

ఈనెల ఏడో తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలు ప్రారంభంకానున్నాయి. దీంతో క్రికెట్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ప్రైవేట్ టెలికాం ఆపరేటింగ్ సంస్థ రిలయన్స జియో సరికొత్త ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. 
 
 
రూ.251 ధరతో ప్రవేశపెట్టిన ఈ ఆఫర్ కొత్త ఆఫర్‌లో 102 జీబీ డేటాను ఇవ్వనుంది. అలాగే, ఈ ఆఫర్‌లో ఐపీఎల్ జరిగే 51 రోజుల పాటు అన్ని మ్యాచ్‌లను మై జియో యాప్‌లో ఉచితంగా వీక్షించవచ్చని జియో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. 
 
కాగా, ప్రతి శుక్ర, శని, ఆదివారాల్లో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారమవుతున్న జియో ధన్ ధనా ధన్ లైవ్ షోలో హోస్ట్‌గా కమెడియన్ సునీల్ గ్రోవర్‍తో పాటు శిల్పా షిండే, ఆలీ అస్గర్, సుగంధ మిశ్రా, కపిల్ దేవ్, సెహ్వాగ్‌లు హాజరై ప్రేక్షకులకు వినోదాన్ని పంచనున్నారు.