బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (15:49 IST)

శశికళను ఇప్పుడల్లా పార్టీ నుంచి పీకేయలేరా..? ఎన్డీయేలోకి అన్నాడీఎంకే?

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్త

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి శశికళను తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అడ్డం పడుతున్నారని తెలిసింది. దీంతో చిన్నమ్మను సాగనంపే ప్రక్రియకు సీఎం ఎడప్పాడి పళని స్వామి ముగింపు పలకలేకపోయారని వార్తలు వస్తున్నాయి. సోమవారం సాయంత్రం ఓపీఎస్ తన మద్దతుదారులతో కలిసి ప్రమాణ స్వీకారంలో పాల్గొననున్నారు. కొత్త మంత్రివర్గ విస్తరణ జరుగనుంది. 
 
ఇప్పటికే ఓపీఎస్-ఈపీఎస్ వర్గాలు ఏకమైన తరుణంలో చిన్నమ్మను పార్టీ నుంచి తొలగించేందుకు ముగ్గురు మంత్రులు అంగీకరించలేదని తెలుస్తోంది. దినకరన్ తరహాలోనే చిన్నమ్మను పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పించేందుకు చేసిన తీర్మానంలో ముగ్గురు మంత్రులు సంతకాలు చేయకపోవడంతో వారిని బుజ్జగించే పనులు జరుగుతున్నాయని తెలిసింది.
 
అన్నాడీఎంకే ఇరు వర్గాలు ఏకమైన తరుణంలో ఎన్డీయేలో ఆ పార్టీ కలవనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తమిళనాడులో పర్యటించనున్న నేపథ్యంలో ఓపీఎస్-ఈపీఎస్ సమావేశమై పార్టీని ఎన్డీయేలో కలిపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ బీజేపీలో కలిసిన తరహాలోనే అన్నాడీఎంకే కూడా ఎన్డీయేలో కలిసిపోతుందని సమాచారం.