శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : గురువారం, 25 ఫిబ్రవరి 2016 (11:12 IST)

భర్త వేరు కాపురం పెట్టలేదని ఇద్దరు పిల్లలతో భార్య ఆత్మహత్య

కుటుంబంలో ఏర్పడిన గొడవల వల్ల ఇద్దరు పిల్లలతో సహా ఓ తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాదఘటన బుధవారం రంగారెడ్డి జిల్లా హయట్‌నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోహెడ గ్రామానికి చెందిన పర్వతాలు అనే వ్యక్తికి భార్య లావణ్య (27), వర్షిత్ ‌(7), జోషిక (5) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరితో పాటు.. మిగిలిన కుటుంబ సభ్యులు కూడా కలిసి ఉమ్మడి ఫ్యామిలీగా నివశిస్తున్నారు. 
 
అయితే, ఉమ్మడి కుటుంబంలో ఉండటం ఇష్టపడిని లావణ్య.. తన భర్తను వేరు కాపురం పెడదామని కోరింది. దీనికి పర్వాతాలు ససేమిరా అన్నాడు. దీంతో వీరిద్దరి మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో.. మనస్సు విరక్తి చెందిన లావణ్య... బుధవారం సాయంత్రం తన ఇద్దరి పిల్లలు వర్షిత్‌, జోషికలు బడి నుంచి ఇంటికి రాగానే తనతో సహా పిల్లలపైనా కిరోసిన్‌పోసి నిప్పటించుకుంది. 
 
ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కలవారు పోలీసులకి సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న హయత్‌నగర్‌ సీఐ వెంకటేశ్వర్లు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.