శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. ప్రాంతాలు
Written By preethi
Last Updated : శుక్రవారం, 28 జులై 2017 (10:26 IST)

సముద్రగర్భంలో 5000 ఏళ్ల నాటి పురాతన దేవాలయం... టెంపుల్ గార్డెన్‌గా?

బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్రగర్భంలో ఒక పురాతన దేవాలయం కనుగొనబడింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

బాలి నగరంలోని పెముటరెన్ తీరం సముద్రగర్భంలో ఒక పురాతన దేవాలయం కనుగొనబడింది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం సముద్రగర్భంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పర్యాటకుల సందర్శన నిమిత్తం 2005లో దీనిని టెంపుల్ గార్డెన్‌గా మార్చారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైన నిర్మాణాకృతితో ఈ కట్టడం నిర్మించబడింది.
 
సముద్రగర్భంలో ఉన్న ఈ హిందూ దేవాలయం ఒకప్పుడు భూమిపైన ఉండేదని, సముద్రం ముంచేయడం వలన ఇది మునిగిపోయిందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ దేవాలయంలో హిందూ దేవుళ్లు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, వినాయకుల విగ్రహాలు చాలానే ఉన్నాయి. ఇది సముద్రమట్టం నుండి 29 కి.మీ ఎత్తులో ఉంది. ఈ గుడి ముఖభాగం ఎత్తు 4 కి.మీ కంటే ఎక్కువగా ఉంది. 
 
ఈ దేవాలయంపై పరిశోధనలు చేయడానికి పురావస్తు శాఖ రంగంలో దిగింది. ఒక వ్యక్తి స్కూబా డైవింగ్ చేస్తున్నప్పుడు మొదటిసారిగా ఈ గుడిని చూసారట. 2000ల సంవత్సరాల కాలంలో అతను దీనిని మళ్లీ పునర్మించడానికి ఎంతో ప్రయత్నించారట. అయితే 2005లో అతను ప్రమాదవశాత్తూ నీటిలోనే మునిగి చనిపోయారట. ఆ తర్వాత 2010లో దీనిని డెవలప్ చేసారు. అప్పటి నుండి చాలా మంది పర్యాటకులు కేవలం ఈ గుడిని చూడటానికే ఇండోనేషియాకు తరలి వస్తున్నారు.