శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (09:31 IST)

నల్గొండ బంద్‌కు టీడీపీ పిలుపు : ఆర్టీసీ బస్సులకు మినహాయింపు!

శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాయడంతో తెలంగాణాలో టీడీపీ, టీఆర్ఎస్‌ల మధ్య చిచ్చు రాజేసింది. ఫలితంగా జిల్లా కేంద్రమైన నల్గొండ జిల్లాలోని టీడీపీ కార్యాలయంపై తెరాస శ్రేణులు దాడులు చేసి ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడమే కాకుండా, నిప్పు కూడా అంటించాయి. 
 
ఈ చర్యకు నిరసనగా తెలంగాణ టీడీపీ పార్టీ బుధవారం నల్గొండ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలో బంద్ వాతావరణం నెలకొంది. అయితే, దీపావళి పండగ కావడంతో ఆర్టీసీ బస్సులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు మూతపడ్డాయి.